నందమూరి తారక రామారావు, బసవరామ తారకం పెద్ద కోడలు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు సోదరి, నందమూరి జయకృష్ణ భార్య పద్మజ (73) ఈ నెల 19 న అనారోగ్య కారణాలతో పరమపదించారు. ఆమె మరణించిన పదమూడవ రోజున కుటుంబ సభ్యులు దశదిన కర్మ నిర్వహించారు. హైదరాబాద్ లోని హోటల్ దసపల్లాలో జరిగిన ఈ కార్యక్రమానికి చంద్రబాబు, లోకేష్, నందమూరి బాలకృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ సహా నందమూరి, దగ్గుబాటి కుటుంబ సభ్యులు బందుమిత్రులు, రాజకీయ ప్రముఖులు పాల్గొని నివాళులర్పించారు!!

