డిజె టిల్లు’ ఫేమ్ విమల్ కృష్ణ, దర్శకత్వంలో రాగ్ మయూర్ కథానాయకుడిగా నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘అనుమాన పక్షి’. చిలక ప్రొడక్షన్స్ బ్యానర్పై రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హీరాచంద్ దండ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మెరిన్ ఫిలిప్ ఈ చిత్రంలో కథానాయకి. ‘అనుమాన పక్షి’ సెప్టెంబర్ 18న థియేటర్లలోకి రానుందని చిత్ర నిర్మాతలు ప్రకటించారు.

