నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన కెరీర్లో ప్రతిష్టాత్మక పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ‘మైసా’లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో గోండ్ గిరిజన మహిళ పాత్ర పోషిస్తున్న రష్మిక , ఆ పాత్రలో ఒదిగిపొవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తున్న’మైసా’ ఆకట్టుకునే ఫస్ట్ గ్లింప్స్తో ఇప్పటికే ఆసక్తిని రేకెత్తించింది.
తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ను అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 27, 2026న ‘మైసా’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్లలోకి రానుంది

