రెయిన్బో సినిమాస్ బ్యానర్ మీద ధనలక్ష్మి బాదర్ల నిర్మాణంలో వైకుంఠ్ బోను తెరకెక్కించిన చిత్రం ‘వసుదేవసుతం’. ఈ సినిమాలో మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి జంటగా నటించారు. ఈ సినిమాని జూలై 10న రిలీజ్ చేయబోతోన్నారు. మ్యూజికల్ ప్రమోషన్స్లో భాగంగా నిన్న మరో పాటను రిలీజ్ చేశారు.
‘ఆనందాల వేళ’ అంటూ సాగే పాటను లవ్లీ హీరో ఆది విడుదల చేసి, లిరికల్ వీడియోని వీక్షించి చిత్రయూనిట్ను అభినందించారు. ఈ పాటకు చైతన్య ప్రసాద్ రాసిన సాహిత్యం, సాయి చరణ్ భాస్కరుణి, శృతిక సముద్రాల గాత్రం.. మణిశర్మ బాణీ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి.

