Saturday, May 24, 2025

Top 5 This Week

Related Posts

సింగిల్ లాభాల్లో సైమికులకి షేర్

శ్రీ విష్ణుతో గీతా ఆర్ట్స్ నిర్మించిన చిత్రం “సింగిల్”. కేతిక శర్మ, ఇవానా కథానాయికలుగా నటించారు, వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు. కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో… విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించారు. మే 9న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. “మన సైనికులు మన దేశం కోసం పోరాడుతుంటే.. సినిమా విషయంలో మేం సెలబ్రేషన్స్‌ చేసుకోవడం సరికాదు అనిపించింది. సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపేందుకే ఈ ప్రెస్‌మీట్‌ పెట్టాం. మన దేశం కోసం పోరాడుతున్న సైనికులకి ఈ సినిమా నుంచి వచ్చే కలెక్షన్స్ లో కొంత భాగం అందజేయనున్నాం” అన్నారు!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles