సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ భగీరథ సంపాదకత్వంలో ఎన్.టి.ఆర్. కమిటీ వెలువరించిన “తారకరామం” గ్రంథం ఆధునిక భగవద్గీతని, ప్రతి తెలుగు వారి ఇంట్లో తప్పకుండా ఉండవలసిన అపురూప గ్రంథమని రచయిత పరుచూరి గోపాలకృష్ణ చెప్పారు.
ఎన్.టి. రామారావు వివిధ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలతో రూపొందించిన “తారకరామం” పుస్తక సమీక్ష సమాలోచన ఎన్ఠీఆర్ వర్ధంతి సందర్భంగా శనివారంనాడు ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో జరిగింది.
ఈ సమావేశంలో జొన్నవిత్తుల, బీరం మస్తాన్ రావు, కాశి విశ్వనాధ్, టి.డి.జనార్దన్,బిక్కి కృష్ణ, దర్శకుడు వీర శంకర్, ఆర్టిస్ట్ డా: కోజు శివప్రసాద్, గుమ్మడి గోపాలకృష్ణ, దొప్పలపూడి రామ మోహన రావు, సినీ జోష్ రాంబాబు తదితరులు పాల్గొని.. “తారకరామం” పుస్తకాన్ని నిశితంగా విశ్లేషించి… పుస్తక సంపాదకులు భగీరధను అభినందించారు!
అజరామరం భగీరథ తారకరామం
