సరికొత్త భాగస్వామ్యాలతో
చెలరేగిపోయేందుకు సన్నాహాలు
బాలీవుడ్ లో కరణ్ జోహర్ ఎంత పాపులరో… టాలీవుడ్ లో దిల్ రాజు అంతకంటే పాపులర్. కరణ్ లా దిల్ రాజు దర్శకనిర్మాత కానప్పటికీ… “బొమ్మరిల్లు” మొదలుకుని మొన్నటి “బలగం” వరకు ఆయన నిర్మించిన కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్స్ ఒక “మేకర్”గా ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చి పెట్టాయి. బాలీవుడ్ లో యమ పాపులర్ అయిన “కాఫీ విత్ కరణ్” ప్రోగ్రామ్ తరహాలో “దిల్ సే విత్ దిల్ రాజు” లాంటి ప్రోగ్రామ్ దిల్ రాజుతో నిర్వహించేందుకు పలు శాటిలైట్ చానల్స్ ఎంతో ఆసక్తి చూపించినప్పటికీ… వివాదాల జోలికి పోవడం ఇష్టం లేని దిల్ రాజు… సదరు ప్రతిపాదనలను సున్నితంగా తిరస్కరించారని సమాచారం. అయితే ఇప్పుడు వీరిద్దరికీ తాజాగా, చాలా యాదృచ్చికంగా ఏర్పడిన పోలిక ఏమిటంటే… ఇద్దరూ సరికొత్త భాగస్వాములను తమ సినీ సామ్రాజ్యంలోకి ఆహ్వానించడం. కరణ్ జోహర్ తన ధర్మ ప్రొడక్షన్స్ లో 50 శాతం వాటాను వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఆదార్ పూనావాలాకు…1000 కోట్లకు అమ్మి కొత్త భాగస్వామిని స్వాగతించగా…దిల్ రాజు కూడా… స్థిరాస్తి రంగంలో కోట్లకు పడగలెత్తిన ఆదిత్య రామ్ ను పార్ట్నర్ గా చేసుకున్నారు. ఇన్ని సారూప్యతలు కలిగిన కరణ్ జోహర్… దిల్ రాజు సమీప భవిష్యత్తులో ఏదైనా పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం చేతులు కలుపుతారేమో వేచి చూడాలి. కరణ్ కు ఇప్పటికే తెలుగులో ప్రభాస్, రాజమౌళి, త్రివిక్రమ్, సురేష్ బాబు, రానా వంటి వారితో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి!!

