తృప్తి రవీంద్ర – రియా జిత్తు
తమిళ హీరో విజయ్ ఆంటోనీ మళ్ళీ ‘భద్రకాళి’తో వస్తున్నారు. ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్పై రామాంజనేయులు జవ్వాజీ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు. ‘భద్రకాళి’ సెప్టెంబర్ 19న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్లు తృప్తి రవీంద్ర, రియా జిత్తు మీడియాతో ముచ్చటించారు.
హీరోయిన్ తృప్తి రవీంద్ర మాట్లాడుతూ.. మాది మహారాష్ట్ర. తమిళ్లో హీరోయిన్ గా ఇది నా ఫస్ట్ సినిమా. సినిమాల్లోకి రాకముందు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేశాను. ఇంజనీరింగ్ సమయంలోనే నాకు సినిమా పట్ల చాలా ఆసక్తి ఉండేది. థియేటర్స్ ప్లేస్ కోసం ఆడిషన్స్ ఇచ్చాను. కెమెరా ముందు నటించడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చే విషయం. కొన్ని టీవీ కమర్షియల్స్ కూడా చేశాను. అరుణ్ గారి డైరెక్షన్ టీం నుంచి ఈ సినిమా కోసం ఆడిషన్ కాల్ వచ్చింది. తర్వాత అడిషన్ ఇచ్చాను. లుక్ టెస్ట్ చేసిన తర్వాత ఈ క్యారెక్టర్ కోసం ఓకే చేశారు. ఈ సినిమాలో చాలా రిలేటబుల్ క్యారెక్టర్ చేస్తున్నాను” అని చెప్పింది.
మరో హీరోయిన్ రియా జిత్తు మాట్లాడుతూ.. నేను మలయాళీ. తమిళ్, మలయాళీ సినిమాలు చూస్తూ పెరిగాను. చైల్డ్ ఆర్టిస్ట్ గా నాకు అనుభవం ఉంది. దాదాపు 15 సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాను. సినిమాల నుంచి కొంత బ్రేక్ తీసుకొని చదువుపై దృష్టి పెట్టాను. చదువు పూర్తయిన తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చాను. విజయ్ ఆంటోనీ గారి 25వ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది” అని పేర్కొంది!!