శ్రీ విష్ణు గీతా ఆర్ట్స్ బ్యానర్ లో #సింగిల్తో అలరించబోతున్నారు. కేతిక శర్మ, ఇవానా కథానాయికలు. వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు. కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్తో కలిసి విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు. #సింగిల్ మే 9న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హీరో శ్రీవిష్ణు సినిమా విశేషాలు పంచుకున్నారు.
మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకుల్ని నవ్వించాలనే ఉద్దేశంతో తీసిన సినిమా ఇది. కథ, స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఇంటర్వెల్, క్లైమాక్స్ కొత్తగా ఉంటాయి. అన్ని సన్నివేశాలు కూడా మనల్ని మనం రిలేట్ చేసుకునేలా ఉంటాయి. యంగ్స్టర్స్ అందరికీ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అలాగే ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా సినిమా చూడొచ్చు. గీతా ఆర్ట్స్ లో వర్క్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఎప్పటినుంచో గీతా ఆర్ట్స్ లో చేయాలి. లక్కీగా ఈ సినిమా కుదిరింది!!
