-మెగాస్టార్ చిరంజీవి
చిలుకూరులోని ప్రొద్దుటూరు వెస్ట్రన్ సెంటర్లో రామడుగు రామ్ దేవ్ రావు ఎక్స్పీరియం పార్క్ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు, సీఎం రమేష్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘దేవ్తో నా పరిచయం ఇప్పటిది కాదు. ఈ ఎక్స్పీరియం పార్కుని మీ అందరి కంటే ముందుగా నేను చూశాను. 2000వ సంవత్సరంలోనే దీని గురించి దేవ్ నాతో పంచుకున్నారు. 2002 నుంచి నేను కూడా తన వద్ద నుంచి మొక్కల్ని తెప్పించుకుంటూనే ఉన్నాను. మా ఇంట్లో ఉండే అనేక రకాల మొక్కలు, చెట్లు రామ్ దేవ్ వద్ద నుంచి వచ్చినవే. రామ్ దేవ్ ఎప్పుడూ పర్యావరణం, ప్రకృతి గురించి ఆలోచిస్తుంటారు. ఈ 150 ఎకరాలను వాణిజ్యంగానూ వాడుకోవచ్చు. కానీ ఆయన ఈ 25 ఏళ్లుగా రకరకాల మొక్కల్ని, వివిద దేశాల నుంచి కొత్త జాతి మొక్కల్ని ఇక్కడకు తీసుకొచ్చి ఈ పార్కుని నిర్మించారు. ఈ ఎక్స్పీరియం పార్కుని చూసి నేను, గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు షాక్ అయ్యాం. దేశవిదేశాల్లో ఉండే ఎన్నో అరుదైన జాతి మొక్కల్ని ఒక చోటకు చేర్చి ఇంత అద్భుతమైన పార్కుని దేవ్ నిర్మించారు. ఇలాంటి మహత్తర కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డిగారు రావడం అభినందనీయం” అన్నారు!!
