ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా తమిళం-తెలుగు ద్విభాషా ప్రాజెక్టు చేస్తోంది. కీర్తిశ్వరన్ ఈ చిత్రంతో డైరెక్టర్ గా పరిచయం కానున్నారు. ‘ప్రేమలు’ చిత్రంతో అందరినీ అలరించిన మమిత బైజు హీరోయిన్ గా నటిస్తుండగా, సీనియర్ నటుడు శరత్ కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు డ్యూడ్ అనే పేరు ఖరారు చేశారు. ఈ చిత్రం 2025 దీపావళికి విడుదల కానుంది!!
