Saturday, July 19, 2025

Top 5 This Week

Related Posts

ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్

తమిళ సూపర్ హిట్ మూవీ “డీఎన్ఏ”ను “మై బేబి” పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు నేడు తీసుకొస్తున్నారు ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సురేష్ కొండేటి. దుప్పాడిగట్టు సారిక రెడ్డి, పి.సాయిచరణ్ తేజ కో ప్రొడ్యూసర్స్. ఈ చిత్ర ట్రైలర్ ను ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ – “మై బేబి” సినిమా తమిళ వెర్షన్ డీఎన్ఏ చూశాక ఈ సినిమాను ఎలాగైనా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అనిపించింది. వాళ్లు చాలా ఎక్కువ రేట్ చెప్పారు. నేను గతంలో చేసిన సినిమాల గురించి వాటి సక్సెస్ గురించి చెప్పాను. అప్పుడు నా మీద నమ్మకంతో వాళ్లు ఈ సినిమా రైట్స్ మా సంస్థకు ఇచ్చారు. ఈ చిత్రానికి నాతో పాటు యష్ ఫిలిం ఫ్యాక్టరీ నుంచి సాయిచరణ్ గారు తోడయ్యారు. ప్రీమియర్ షో చూసి మురళీ మోహన్ లాంటి సీనియర్ నటులు కంటతడి పెట్టుకున్నారు. అప్పుడే ఈ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అవుతుంది అనేది అర్థమైంది. ఈ చిత్రానికి అన్ని ఏరియాల నుంచి క్రేజీగా బిజినెస్ జరిగింది. నేను ప్రొడ్యూస్ చేసిన చిత్రాల్లో అన్నింటికన్నా ఎక్కువ థియేటర్స్ లో “మై బేబి” నేడు రిలీజ్ కాబోతోంది” అన్నారు!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles