తమిళంలో ఘన విజయం సాధించిన ‘డీఎన్ఏ’ మూవీ తెలుగులో ‘మై బేబీ’ పేరుతో విడుదల కానుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 18, 2025న గ్రాండ్గా విడుదల కానుంది. “ప్రేమిస్తే, జర్నీ, షాపింగ్మాల్, పిజ్జా” వంటి విజయవంతమైన అనువాద చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాత సురేశ్ కొండేటి ఈ ‘మై బేబి’ని తెలుగులో విడుదల చేస్తున్నారు. అధర్వ మురళి, నిమిషా సజయన్ జంటగా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్కి నెల్సన్ వెంకటేసన్ దర్శకుడు. 2014లో ఒక సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ జీవితంలో జరిగిన దుర్ఘటన నేపథ్యంలో ఈ కథ సాగుతుందని, గ్రిప్పింగ్ స్క్రీన్ప్లేతో రూపొందిన భావోద్వేగపూరిత కథాంశమిదని మేకర్స్ చెబుతున్నారు. ఎస్.కె.పిక్చర్స్ ద్వారా ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి సహ నిర్మాతలు : సాయి చరణ్ తేజ పుల్లా, దుప్పటి గట్టు సారిక రెడ్డి!!
