ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ప్రభుత్వాన్ని బిజెపి పార్టీ చిత్తు చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో బిజెపి ప్రభుత్వం కొలువు తీరడంతో దేశ వ్యాప్తంగా బిజెపి నాయకులు, కార్యకర్తలు అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు .ఏపీ బిజెపి యువ నాయకులు మరియు ఢిల్లీ పూర్వ సివిల్స్ విద్యార్థి కొట్టె మల్లికార్జున మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ అసెంబ్లీ 70 నియోజకవర్గాల్లో 48 సీట్లతో బిజెపి పార్టీ గెలిచి 27 సంవత్సరాల తర్వాత భారీ మెజారిటీతో భారతదేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వాన్ని స్థాపించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాను. గతంలో ఢిల్లీ లో 2017 సంవత్సరంలో శ్రీరామ్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ లో ఏపీ ఎన్టీఆర్ కాపు విద్యోన్నతి ద్వారా సివిల్స్ ప్రిపేర్ అవ్వడం జరిగింది.

తదనంతరం 2019 లో బిజెపి పార్టీలో చేరి ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తూ,ఆరు సంవత్సరాల తర్వాత బిజెపి యువ నాయకులుగా ఢిల్లీలో బిజెపి పార్టీ నాయకులు తరుపున ప్రచారం చేయడం తో పాటు, వారి విజయంలో భాగస్వామ్యం అవ్వడం చాలా గర్వంగా ఉందని తెలిపారు. ముఖ్యంగా న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజక వర్గంలో మాజీ ముఖ్యమంత్రి సాయుబ్ సింగ్ కుమారుడు అయిన పర్వేశ్ సాహెబ్ సింగ్ వర్మ తరుపున ఏపీ బిజెపి యువ నాయకులు రాయల్ శ్రీనివాస్, రమేష్, రామకృష్ణ, విజయ్ తో కలిసి బిజెపి మేనిఫెస్టో అంశాలను పేద మధ్య తరగతి ప్రజలకు అవగాహన కల్పిస్తూ వినూత్న కార్యక్రమాలతో ప్రచారం చేయడం జరిగింది. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పై గెలిచి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి గా మరియు మంత్రి వర్యులుగా ప్రమాణం చేసినటువంటి పర్వేశ్ వర్మకు , అలాగే ఢిల్లీ సిఎం గా ప్రమాణ స్వీకారం చేసిన రేఖా గుప్తా కు శుభాకాంక్షలు. ఢిల్లీ ప్రమాణ స్వీకారానికి ఎన్డీఏ పాలిత 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాని నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షా, రాజనాథ్ సింగ్ తో పాటు, ఏపీ సిఎం చంద్ర బాబు నాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, బిజెపి వైస్ ప్రెసిడెంట్ విష్ణు వర్ధన్ రెడ్డి,ఇతర కేంద్ర మంత్రులతో పాటు, అశేష ప్రజానీకం, కార్యకర్తలు, అభిమానులు హాజరవడం పట్ల బిజెపి యువ నాయకులుగా సంతోషం వ్యక్తం చేస్తున్నాను.డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా ఢిల్లీలో ప్రజా సంక్షేమం కొనసాగబడడమే కాకుండా, నరేంద్ర మోడీ సారథ్యంలో వికసిత భారత్ వికసిత ఢిల్లీ దిశగా ఢిల్లీ అడుగులు వేస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాను అని బిజెపి యువ నాయకులు కొట్టె మల్లికార్జున మీడియాతో పేర్కొనడం జరిగింది.
