రైటర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్
హీరోయిన్ సమయ రెడ్డి
తెలుగమ్మాయి సుమయ రెడ్డి హీరోయిన్గా, నిర్మాతగా, రచయితగా ‘డియర్ ఉమ’ చిత్రం ఈనెల18న రాబోతోంది. పృథ్వీ అంబర్ హీరో. లైన్ ప్రొడ్యూసర్ నగేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నితిన్ రెడ్డి. సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. ఎన్నో చిత్రాలకు అద్భుతమైన విజువల్స్ అందించిన రాజ్ తోట కెమెరామెన్గా, బ్లాక్ బస్టర్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన రదన్ సంగీత దర్శకుడిగా పని చేశారు. ఇక ప్రమోషన్స్లో భాగంగా సుమయ రెడ్డి మీడియాతో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
మాది అనంతపూర్. మోడలింగ్ రంగం నుంచి ఇటు వైపు వచ్చాను. నాకు చిన్నప్పటి నుంచీ సినిమాలంటే ఇష్టం. మొదట్లో సినిమాలు చేయడం అంటే చాలా ఈజీ అనుకున్నాను. కానీ అది అంత సులభం కాదు అని అర్థమైంది.
కరోనా టైంలో నాకు ప్రతీ రోజూ ఓ కల వస్తూనే ఉండేది. అది నన్ను వెంటాడుతూ ఉన్నట్టుగా అనిపించింది. అలా ఆ కలలో వచ్చిన పాయింట్ మీదే కథను రాసుకున్నాను. అందరికీ కనెక్ట్ అయ్యేలా మా చిత్రం ఉంటుంది.
తెలుగు హీరోని ట్రై చేశాం. చాలా కారణాల వల్ల మిస్ అవుతూ వచ్చాం. పృథ్వీ అంబర్కి కథ చెప్పిన వెంటనే ఓకే చేశారు. కొత్త ప్రొడక్షన్ అని కూడా చూడకుండా కథ నచ్చి వెంటనే ఓకే చెప్పారు.
కార్పొరేట్ హాస్పిటల్స్లో జరిగే వాటిని చూపించబోతున్నాం. డాక్టర్లు, పేషెంట్స్కి మధ్యలో ఉండే పర్సన్స్ సరిగ్గా లేకపోతే ఏం జరుగుతుందో చూపించాం.
డియర్ ఉమ చిత్రం కాస్త ఫిక్షనల్. కాస్త రియల్. సోషల్ మెసెజ్ అని కాకుండా ఓ సొల్యూషన్ కూడా చెబుతాం. అందరికీ అవగాహన కల్పించేలా చిత్రం ఉంటుంది. హీరోయిన్గా ఉండి నిర్మాతగానూ సినిమాను చేయాలని అనుకోలేదు. కానీ అలా చేయాల్సి వచ్చింది!!