ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్, తమిళనాడు, కేరళ, కన్నడ ఇలా చెప్పుకుంటూ పోతే గత 25-30 సంవత్సరాలుగా హీరోగా, విలన్ గా, ముఖ్యపాత్ర దారుడిగా అద్వితీయమైన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న సోనూసూద్ గారు, కోవిడ్ సమయంలో చేసిన కార్యక్రమాలు తెలిసిందే, ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసిన విషయం తెలిసిందే,
సేవ కార్యమాలతో పాటు, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే కార్యక్రమాలు కూడా పాల్గొనడానికి సిద్ధమయ్యాడు,
ఇటీవలే ఫతే లాంటి బ్లాక్ బస్టర్ మూవీ ను అందించిన సోనూ సూద్ గారిని బందూక్ చిత్రంతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకులు లక్ష్మణ్ మురారిశెట్టి గారు
నిన్న సాయంత్రం హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ పంక్షన్లో కలిశారు, ఈ భేటీలో రాబోయే పలు సినిమాలు గురించి చర్చించారు,
ఈ భేటీలో పారిశ్రామిక వేత్త, సోషల్ వర్కర్ శ్రీ సిద్దు .k గారు, కాకతీయ ఇన్నోవేటివ్స్ సంస్థ పార్టనర్ శ్రీ రమేష్ మాదాసు గారు ఉన్నారు.
వీరందరి కాంబినేషన్ లో ఏదైనా ఒక సెన్సేషనల్ ప్రాజెక్ట్ రావాలని ఆశిద్దాం
