HomeEntertainmentతెలుగు చిత్ర నిర్మాతల మండలి ఎన్నికలలో ఘన విజయం సాధించిన మన ప్యానెల్

తెలుగు చిత్ర నిర్మాతల మండలి ఎన్నికలలో ఘన విజయం సాధించిన మన ప్యానెల్

- Advertisment -

తెలుగు చిత్ర నిర్మాతల మండలి 2026 ఎన్నికలలో మన ప్యానల్, ప్రోగ్రెసివ్ ప్యానల్ పోటీ చేయగా మన ప్యానల్ నుండి సి కళ్యాణ్ గారు ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డారు. అలాగే అదే మన ప్యానల్ నుండి చదలవాడ శ్రీనివాసరావు గారు కోశాధికారిగా ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్ గా మన ప్యానెల్ నుండి మోహన్ వడ్లపట్ల గారు, ప్రోగ్రెస్ ప్యానెల్ నుండి దామోదర ప్రసాద్ గారు ఎన్నికయ్యారు. అలాగే జాయింట్ సెక్రటరీలుగా మన ప్యానల్ నుండి అమ్మిరాజు గారు, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు గెలిచారు. ఈసీ సభ్యులుగా ప్రోగ్రెసివ్ ప్యానల్ నుండి ముగ్గురు అనగా మైత్రి రవి గారు, నిరంజన్ రెడ్డి గారు, డిఎస్ రావు గారు గెలవగా మన ప్యానెల్ నుండి 12 మంది పద్మిని గారు, ఎషియన్ సునీల్ గారు, మోహన్ గౌడ్ గారు, శివలెంక కృష్ణప్రసాద్ గారు, దానయ్య గారు, వంశీ నందిపాటి గారు, పల్లి కేశవ రావు గారు, శ్రీనివాసరావు గారు, పుల్లారావు గారు, బాపిరాజు గారు, ఆర్ కె కౌడ్ గారు,నయీం గారు గెలిచారు. ప్రస్తుతం సెక్రటరీ పోస్టు గురించి కేసు కోర్టులో ఉండటంతో వారి ఎన్నికల ఫలితాలను ఒక సీల్డ్ కవర్లో ఎన్నికల అధికారి దుర్గా ప్రసాద్ గారు శీల్ చేసి కోర్టులో అప్పగించనున్నారు. 8వ తేదీన కోర్టులో జడ్జ్ గారి సమక్షంలో సెక్రటరీ ఎన్నికల ఫలితాన్ని వెల్లడించనున్నారు.

ఈ సందర్భంగా ప్రెసిడెంట్ సి కళ్యాణ్ గారు మాట్లాడుతూ… “ముందుగా మాకు సహకరించి మమ్మల్ని సపోర్ట్ చేసిన మీడియా వారికి థాంక్స్. మాకు ఓటు వేయడం కోసం వచ్చిన దూరం నుండి వచ్చిన అందరికీ థాంక్స్. 95% మెజారిటీతో మన ప్యానెల్ సభ్యులను గెలిపించినందుకు థాంక్స్. మేము ఇక్కడికి మంచి చేయడం కోసం వచ్చాము. నిర్మాతల కోసం వచ్చాము, నిర్మాతల మంచి కోసం పని చేస్తాము. అన్ని పరిశ్రమలకంటే తెలుగు పరిశ్రమ బావుంది. మాకు అందరూ కోపరేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. అతి త్వరలోనే ఒక ప్రెస్ మీట్ పెట్టి మా కార్యాచరణను వెల్లడిస్తాము. చిన్న నిర్మాతలకు అన్ని విధాలుగా సాయంగా నిలబడతాడు. నాకు సహకరించిన బండ్ల గణేష్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను” అన్నారు.

అలాగే గెలిచిన సభ్యులు అందరికీ వచ్చిన ఓట్లు వెల్లడించి వారి విజయానికి అభినందనలు తెలియజేశారు. అలాగే సెక్రటరీ సంబంధిత కేసు కోర్టులో ఉండటంతో అధికారంగా కోర్టు వెల్లడించనుంది.

కోశాధికారి చదలవాడ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ… “మాకు మంచి మెజారిటీతో గెలిపించిన ఓటర్లకు థాంక్స్. మాకు సపోర్ట్ ఇచ్చిన నందమూరి కుటుంబానికి, సునీల్ నారంగ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మా ప్యానెల్ లో అనుభవజ్ఞులు ఉండటంతో వారి అనుభవాన్ని ఉపయోగించుకుని సినీ పరిశ్రమను మరింత ఉన్నత స్థాయికి చేరేందుకు కృషి చేస్తాము. చిన్న నిర్మాతలకు అండగా నిలబడతాడు” అన్నారు.

తుమ్మల ప్రసన్న కుమార్ గారు మాట్లాడుతూ… “మాకు సపోర్ట్ చేస్తూ వచ్చిన మీడియా వారికి థాంక్స్. ఇక్కడ గెలిచిన సభ్యులు అందరికీ అభినందనలు. పరిశ్రమకు మంచి చేసే వారు గెలిచారు. నిర్మాతల మండలి ఎన్నికలలో బలమైన వ్యక్తులు గెలవడం గొప్ప విషయం” అన్నారు.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments