-హీరో సుమంత్ ప్రభాస్
యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ‘గోదారి గట్టుపైన’తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ కథానాయిక, జగపతి బాబు, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషించారు. లైలా ఈ చిత్రంతో తెలుగులో రీ-ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రం నేడు రిలీజ్ కానుంది. ప్రీరిలీజ్ ఈవెంట్లో హీరో సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ.. దర్శకుడు సుభాష్ చంద్ర ఒక బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్. తనకి హ్యూమన్ ఎమోషన్స్, వాల్యూస్ బాగా తెలుసు. వాటినే అంత అద్భుతంగా సినిమాలోకి ట్రాన్స్లేట్ చేశాడు. ఈ సినిమా చూశాక మంచి హ్యూమన్ వాల్యూస్ ఉన్న సినిమా చూసి ఎన్ని రోజులు అయిందో అనిపించింది. ఈ సినిమా చేయడం చాలా గర్వంగా ఉంది” అని అన్నారు!!

