రాజ్ బి శెట్టి హీరోగా నటించిన కన్నడ సూపర్ హిట్ మూవీ “రక్కసపురదోల్”ను తెలుగు ప్రేక్షకుల ముందుకు “రాక్షసపురం” టైటిల్ తో తీసుకొస్తున్నారు ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు. ఈ చిత్రాన్ని కె.ఎన్. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై కె. రవివర్మ నిర్మించారు. రవి సారంగ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత కె.ఎస్. రామారావు సమర్పణలో “రాక్షసపురం” సినిమా క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై త్వరలో తెలుగులో రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఈ సందర్భంగా నిర్మాత కె.ఎస్ రామారావు హైదరాబాద్ ఎఫ్ఎన్ సీసీలో జరిగిన కార్యక్రమంలో చిత్ర విశేషాలను తెలిపారు.

ప్రముఖ నిర్మాత కె.ఎస్. రామారావు మాట్లాడుతూ -* నా కెరీర్ డబ్బింగ్ చిత్రంతోనే ప్రారంభమైంది. కమల్ హాసన్ నటించిన ఎర్రగులాబీలు చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశాను. ఆ సినిమా ఘన విజయం సాధించింది. ఇప్పుడు కొంత విరామం తర్వాత మళ్లీ మా క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై రాక్షసపురం అనే మూవీని తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నా. ఈ చిత్రాన్ని ఒక డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ గా దర్శకుడు రవి సారంగ అద్భుతంగా రూపొందించాడు. నా స్నేహితుడు రవివర్మ నిర్మించాడు. ఈ సినిమా చూశాక థ్రిల్ అయ్యాను.

ప్రొడ్యూసర్ రవివర్మకు ఫోన్ చేసి నేను ఈ సినిమా తెలుగులో రిలీజ్ చేస్తానని చెప్పాను. ఈ చిత్రంలో హీరో రాక్షస సంహారం చేస్తుంటాడు. అది ఒక ఊరిలో జరుగుతుంటుంది. అందుకే టైటిల్ రాక్షసపురం అని పెట్టారు. నేను 86లో చిరంజీవి గారితో రాక్షసుడు అనే చిత్రాన్ని రూపొందించాను. ఆ సినిమా టైటిల్ కొందరికి నెగిటివ్ గా అనిపించింది. కానీ హీరో చేసేవన్నీ మంచి పనులే, కథ మంచిదే. హీరో విలన్స్ కు రాక్షసుడు కాబట్టి ఆ టైటిల్ పెట్టాం. ఈ రాక్షసపురంలో కూడా హీరో రాక్షసుల్లాంటి విలన్స్ ను సంహరిస్తాడు. ఒక డిఫరెంట్ సినిమా కాబట్టి, ఇప్పుడు ఉన్న ట్రెండ్ కు నచ్చుతుంది. ఈ నెలాఖరులోనే ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నాం” అన్నారు!!
